![]() |
మంత్రి పొన్ముడి |
హిందూ ఆచారాలు, మహిళల విషయంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన తమిళనాడు మంత్రి పొన్ముడిపై రాష్ట్ర హైకోర్టు మండిపడింది. ఆయనపై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ఒకవేళ డీఎంకే నేతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే, అప్పుడు పోలీసులపై సుమోటో కేసు నమోదు అవుతుందని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్ హెచ్చరించారు. మంత్రి పొన్ముడి చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని, ఒకవేళ ఆ ఘటనపై ఫిర్యాదు లేకున్నా సు రిజిస్టర్ చేసి, దానిపై విచారణ చేపట్టాలని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.ఈ కేసును మళ్లీ ఏప్రిల్ 23వ తేదీన విచారించనున్నట్లు పేర్కొన్నారు.
తమిళనాడు మంత్రి కె. పొన్ముడి హద్దులు దాటి పోయారు. ఓ మంత్రి స్థానంలో వుండి అన్ని మతాలనూ గౌరవించాల్సింది వుండగా... హిందూ మతంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సమాజంపై ఆయనపై దుమ్మెత్తి పోస్తోంది. ఓ స్థాయిని దాటి హిందువులు ధరించే తిలకంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ... తీవ్రంగా అవమానించారు.
తమిళనాడు అటవీ శాఖా మంత్రిగా పొన్ముడి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే.. పురుషులు, మహిళలు వున్న ఓ కార్యక్రమంలో పొన్ముడి పాల్గొన్నారు. హిందువులు ధరించే తిలకంపై జోకులు వేశారు. హిందువులు ధరించే పవిత్రమైన తిలకాలను లైంగిక భంగిమలతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి.
''మహిళలు, దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వెళ్తాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డ బొట్టు (శైవమతానికి సంబంధించినది) లేదా నామం (వైష్ణవానికి సంబంధించిన నిలువు తిలకం) అతడు ధరిస్తాడా అని అడిగింది. ఆ వ్యక్తి శైవుడైతే ‘పడుకునే’ పొజిషన్, వైష్ణవుడు అయితే ‘లేచి నిలబడే’ పొజిషన్ ఉంటుందని ఆమె వివరించింది’ అని జోక్ వేశారు.